Begin typing your search above and press return to search.

ఎవరూ లేరని ప్రియుడిని ఇంటికి పిలిచింది... కట్ చేస్తే...?

ఈ సమయంలో తన భర్త, తల్లిదండ్రులతో కలిసి అతడిని కడతేర్చింది. స్థానికంగా సంచలనంగా మారిన ఈ విషయంపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి!!

By:  Tupaki Desk   |   15 Feb 2024 4:11 AM GMT
ఎవరూ లేరని ప్రియుడిని ఇంటికి పిలిచింది... కట్  చేస్తే...?
X

ఇటీవల కాలంలో ప్రియుడి మోజులో పడి భర్తను, పిల్లలను చంపిస్తున్న మహిళలకు సంబంధించిన పలు విషయాలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పుడు చెప్పుకోబోయే అంశం కాస్త భిన్నమైంది. వేదిస్తున్న ప్రియుడిని భర్తతో కలిసి చంపాలనుకుంది ఓ వివాహిత. అనుకున్నట్లుగానే పక్కాగా స్కెచ్ వేసింది.. ఎవరూ లేరు ఇంటికి రా అంటూ ప్రియుడిని ప్రేమగా ఇంటికి పిలిచిందని తెలుస్తుంది. కట్ చేస్తే... ప్రియుడిని కడతేర్చింది.

అవును... తనను విపరీతంగా వేధిస్తున్న ప్రియుడిని అంతమొందించాలని నిర్ణయించుకుంది ఓ వివాహిత. దీనికోసం కుటుంబ సభ్యులతో కలిసి ఆమె ఓ పథకం రచించింది. ఇందులో భాగంగా... ఎవరూ లేరని ప్రియుడిని ఇంటికి పిలిచింది. ఈ సమయంలో తన భర్త, తల్లిదండ్రులతో కలిసి అతడిని కడతేర్చింది. స్థానికంగా సంచలనంగా మారిన ఈ విషయంపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి!!

ఆదిలాబాద్ జిల్లా చెన్నూరుకు చెందిన ఒక మహిళకు సుమారు 12ఏళ్ల క్రితమే వివాహమైంది. ఈ సమయంలో స్థానికంగా హార్వెస్టర్‌ డ్రైవర్‌ గా పనిచేస్తున్న వ్యక్తితో ఈమెకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. అనంతరం... నాలుగు నెలల క్రితం అతడితోనే కలిసి వెళ్లిపోయింది. దీంతో తన భార్య తప్పిపోయిందని ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేయగా... పోలీసులు ఆమెకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు.

అయినా కూడా పట్టించుకోని ఆమె... తన భర్తతో ఉండేందుకు నిరాకరించి ప్రియుడితోనే తిరిగి వెళ్లిపోయింది. అయితే... ఇటీవల కాలంలో ప్రియుడితో ఆమెకు మనస్పర్థలు రావడంతో నెల క్రితం తల్లిగారింటికి తిరిగివచ్చి అక్కడే ఉంటోంది. ఈ విషయం తెలుసుకున్న ప్రియుడు.. తరచూ అక్కడికి వచ్చి ఇబ్బందులకు గురిచేస్తున్నాడట. దీంతో ఎలాగైనా అతడిని కడతేర్చాలని ఆమె ఫిక్సయ్యిందని అంటున్నారు!

ఈ విషయాన్ని తన భర్తకు కూడా చెప్పి.. తల్లిగారింటికి రప్పించి.. కుటుంబ సభ్యులతో కలిసి ఆమె ఒక పథకం రచించింది. ఇందులో భాగంగా ప్రియుడికి ఫోన్‌ చేసి ఇంట్లో ఎవరూ లేరని రావాలంది. ఈ సమయంలో సదరు ప్రియుడు మరో ఇద్దరితో కలిసి ఆమె ఇంటికి బయలుదేరాడు. ఈ సమయ్యంలో ఇంటి సమీపంలోకి రాగానే కంట్లో కారంచల్లి, కర్రలతో చితకబాదడంతో ప్రియుడు అక్కడికక్కడే మృతిచెందాడు.

అనంతరం మృతదేహాన్ని సమీపంలోని అటవీప్రాంతానికి తీసుకెళ్లి దహనం చేశారు. ఈ సమయంలో ఆ ప్రియుడి అరుపులు కేకలు విన్న అతని స్నేహితులు పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.